రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
- రాజస్థాన్లో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకునే అవకాశం
- నామినేషన్ దాఖలు సమయంలో సోనియా గాంధీ వెంట రాహుల్, ప్రియాంక, అశోక్ గెహ్లాట్
- తొలిసారి రాజ్యసభ బరిలో నిలిచిన ఏఐసీసీ అగ్రనాయకురాలు
రాజస్థాన్లో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుంది. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15 కాగా, 27న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యాక సోనియా గాంధీ 1999లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. నాడు అమేథి, బళ్లారి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. 2004 నుంచి ఆమె రాయ్బరేలి నుంచి పోటీ చేస్తున్నారు.