Daggubati Purandeswari: వైసీపీ తమ అభ్యర్థులనే కాదు ఓటర్లను కూడా మరో చోటుకి బదిలీ చేస్తోంది: పురందేశ్వరి

Purandeswari alleges there is conspiracy behind YSRCP Why Not 175 slogan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీఎం జగన్, వైసీపీ చెబుతున్న వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందని అన్నారు. 

రాబోయే ఎన్నికల్లోనూ అక్రమ ఓట్ల సాయంతో గెలవాలని భావిస్తున్నారని, అందుకే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అభ్యర్థులతో పాటు ఓటర్లను కూడా బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఓట్ల దందాను సీఎం జగనే నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అక్రమాలను అడ్డుకోవాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. 

"ఫేక్ ఎపిక్ కార్డులు రూపొందించి, దొంగ ఫొటోలు అతికించి ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లను వేశారు. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చుతున్నారు. మంత్రి విడదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు బదిలీ అయ్యారు. వారి అనుయాయులు 10 వేల మందిని గుంటూరు తీసుకువచ్చి, వారి ఓట్లు నమోదు చేసే ప్రక్రియ లోపాయికారీగా జరుగుతోంది" అని పురందేశ్వరి ఆరోపించారు. 
Go Back to Shorts
Daggubati Purandeswari
Why Not 175
Fake Votes
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News