దొడ్డిపట్లలో దేవుళ్ల విగ్రహాలపై రసాయనాలు చల్లిన ఆగంతుకులు
- దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలో ఘటన
- మూలవిరాట్టుతో పాటూ ఉత్సవవిగ్రహం, శఠగోపంపై కెమికల్స్ చల్లిన వైనం
- గర్భగుడి గ్రిల్స్ మధ్యలోంచి రసాయనాలు చల్లారన్న అర్చకుడు
- పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించిన గ్రామస్థులు
ఆలయద్వారాలు తెరిచే సరికే దుర్వాసన వచ్చిందని, విషంతో కూడిన కెమికల్స్ పడినట్టు అర్థమైందని నరసింహాచారి తెలిపారు. ఆ తరువాత విషయాన్ని ఆలయ అధికారి ఎన్. సతీశ్కు ఫోన్లో తెలిపామని చెప్పారు. అయితే, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలున్నా 8 నెలలుగా అవి పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఘటన విషయం తెలిసిన వెంటనే భజరంగ్దళ్ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.