Vishwambhara: మెగా జోడీగా ... దేవకన్యగా మీనాక్షి చౌదరి?

  • షూటింగు దశలో చిరంజీవి 'విశ్వంభర'
  • సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ 
  • 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా 
  • ప్రధాన నాయికగా మెరవనున్న త్రిష
 Meenakshi in Vishwambhara Movie

మీనాక్షి చౌదరి కెరియర్ ను పరిశీలిస్తే, ఆమె గ్రాఫ్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. 'హిట్' .. 'ఖిలాడీ' సినిమాల తరువాత ఆమె 'గుంటూరు కారం' సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో ఆమె మహేశ్ బాబు మరదలి పాత్రలో కనిపించింది. ఆ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆమె చాలా అందంగా కనిపించింది. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 

ఆ గ్లామర్ కారణంగానే ఆమె ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ 'విశ్వంభర' సినిమాను రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ ను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. 

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నట్టుగా సమాచారం. ఆ ముగ్గురు కథానాయికలలో ప్రధానమైన నాయికగా త్రిషను ఎంపిక చేశారు. ఈ రోజునే ఆమె ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మరో కథానాయికగా మీనాక్షి చౌదరినీ తీసుకున్నారనీ .. దేవకన్యగా ఆమె కనిపించనుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News