భారత గడ్డపై టెస్టు క్రికెట్‌లో ఛేదించిన అత్యధిక టార్గెట్లు ఇవే!

  • సొంతగడ్డపై భారీ టార్గెట్ ఛేదనలో భారత్ టాప్
  • 2008లో ఇంగ్లండ్‌పై 387 పరుగుల ఛేదన
  •  టాప్-10 జాబితాలో ఆరుసార్లు భారత జట్టుకు చోటు
ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారతజట్టు పట్టు సాధించింది. ప్రత్యర్థికి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని, ఆసియాలో అది అసాధ్యమని గత రికార్డులు చెబుతున్నాయి. ఇంగ్లండ్ కూడా గతంలో ఎప్పుడూ ఇంత టార్గెట్‌ను భారత గడ్డపై ఛేదించిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యధిక అత్యధిక టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిన జట్లేవో తెలుసుకుందాం.

జట్టు    
ఛేదించిన టార్గెట్
ప్రత్యర్థి
వేదిక/సంవత్సరం
ఇండియా
387/4    
ఇంగ్లండ్
చెన్నై, 2008
వెస్టిండీస్    
276/5
ఇండియా    
ఢిల్లీ, 1987
ఆస్ట్రేలియా
195/2
 ఇండియా
బెంగళూరు, 1998
ఇండియా
276/5    
వెస్టిండీస్    
ఢిల్లీ, 2011
ఇండియా    
265/5    
న్యూజిలాండ్
బెంగళూరు, 2012
ఇండియా
256/8
ఆస్ట్రేలియా
బ్రాబౌర్న్, 1964
ఇండియా
216/9
ఆస్ట్రేలియా     
మొహాలీ, 2010 
ఇంగ్లండ్
208/4
ఇండియా    
ఢిల్లీ, 1972
ఇండియా    
207/3    
ఆస్ట్రేలియా    
బెంగళూరు, 2010

Team India
Team England
Team Australia
Test Match

More Telugu News