చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిల మాకు రాజకీయ శత్రువే: మంత్రి పెద్దిరెడ్డి
- వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న పెద్దిరెడ్డి
- వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ
- షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని వెల్లడి
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని... కాంగ్రెస్ లో ఉన్నవాళ్లంతా ఎప్పుడో వైసీపీలోకి వచ్చేశారని వివరించారు. రఘువీరా, షర్మిల, గిడుగు రుద్రరాజు, కేవీపీ.. ఈ నలుగురు మాత్రమే చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని ఎద్దేవా చేశారు.