తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన కోదండరాంకు పదవి ఇస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు?: మహేశ్ కుమార్ గౌడ్
- ప్రియాంకగాంధీ కచ్చితంగా రాష్ట్రానికి వస్తారు... ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్న కాంగ్రెస్ నేత
- బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
- కాంగ్రెస్ పాలనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలకు విసుగువచ్చిందని... అందుకే ఇంటికి పంపించారన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్కు కాంగ్రెస్ పాలనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాలకు తేడా లేకుండా తయారు చేసింది వారే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సహా అన్ని లెక్కలు బయటపెడతామని హెచ్చరించారు.