చంద్రబాబు నా అభిమాన హీరో: ప్రముఖ ఎమ్ఎన్సీ మాజీ సీఈఓ
- హైదరాబాద్లో జరిగిన సాహితీ వేడుకలో పాల్గొన్న ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మాజీ సీఈఓ గురుచరణ్ దాస్
- బాబు విజన్ వల్లే నగరానికి ఐటీ కంపెనీలు వచ్చాయని వెల్లడి
- సాఫ్ట్వేర్, డిజిటల్ రంగంలో భారత్ ముందుండటం గర్వకారణమని వ్యాఖ్య
సంస్కరణల తరువాత భారత ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఎదిగిందని గురుచరణ్ దాస్ అన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడిందన్నారు. ఆర్థిక తారతమ్యాలు పెరిగినమాట కూడా వాస్తవమేనన్నారు. అయితే, ఈ సంపద ఉపాధి అవకాశాలనూ పెంచిందన్నారు. 1991 తరువాత పేదరికం తగ్గి, మధ్య తరగతి వర్గం పెరిగిందన్న ఆయన తన తదుపరి పుస్తకం ఈ అంశంపైనే ఉంటుందని చెప్పారు. తన తాజా రచన ‘ఎనదర్ స్టార్ ఆఫ్ ఫ్రీడం’పై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వాసంతి శ్రీనివాసన్తో చర్చించారు. ‘ది గ్రేట్ ఫ్లాప్ ఆఫ్ 1942’ పుస్తకంపై ముకుంద్ పద్మనాభన్తో కూడా ముచ్చటించారు.