ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు... కోహ్లీ స్థానంలో పాటిదార్!
- టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్
- వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం
- రజత్ పాటిదార్ తో కోహ్లీ స్థానం భర్తీ!
- మరోసారి సర్ఫరాజ్ ఖాన్ కు మొండిచేయి!
- ముగిసిన పుజారా, రహానే శకం
తాజాగా బీసీసీఐ సెలెక్టర్లు మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ వైపు మొగ్గుచూపినట్టు తెలిసింది. రజత్ పాటిదార్ ఇంగ్లండ్-ఏ జట్టుపై ఇటీవల భారీ సెంచరీ నమోదు చేసి ఫామ్ చాటుకున్నాడు.
పాటిదార్ ను భారత టెస్టు జట్టుకు ఎంపిక చేసిన నేపథ్యంలో, సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ కు మరోసారి మొండిచేయి చూపినట్టు అర్థమవుతోంది. దేశవాళీ క్రికెట్లో గత కొన్ని సీజన్లుగా సర్ఫరాజ్ ఖాన్ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. సెంచరీల మోత మోగిస్తూ, పరుగులు వెల్లువెత్తిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
అదే సమయంలో, పాటిదార్ ఎంపికతో సీనియర్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల శకం ముగిసినట్టయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.