ఫ్లెక్సీలు కడితే టిక్కెట్ ఇస్తారా? పని చేశానని భావిస్తే ఇస్తారు.. లేదంటే లేదు అంతే!: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు
- గల్లీకో ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ రాదని వ్యాఖ్య
- బీజేపీ ఎంపీ టిక్కెట్ అంగట్లో సరుకు కాదన్న సోయం
- నేను ఏం చేశానో పార్టీ అధిష్ఠానానికి తెలుసునన్న బాపూరావు
తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో గెలిచిన తర్వాత ఓ ఎంపీగా ఏం చేశానో పార్టీ అధిష్ఠానానికి తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ టిక్కెట్ కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పైనా సోయం బాపూరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగ పోరాటాలను తిప్పికొట్టాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.