Revanth Reddy: మణిపూర్‌పై కాంగ్రెస్ ట్వీట్... రీ-ట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

  • మణిపూర్ ఎనిమిది నెలలకు పైగా మంటల్లో కాలిపోతోందంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
  • ప్రధాని మోదీ మణిపూర్‍‌లో ఎప్పుడు పర్యటిస్తారని ప్రశ్న
  • మణిపూర్‌కు మద్దతిస్తున్నాం... 'మణిపూర్.. మేం మీతో ఉన్నా'మని పేర్కొన్న తెలంగాణ కాంగ్రెస్
  • దీనిని రీట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy retweets Manipur issue

మణిపూర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ చేసిన ట్వీట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీ-ట్వీట్ చేశారు. 'మణిపూర్ వీఆర్ విత్ యూ' అంటూ తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ఓ ట్వీట్ చేసింది. దీనిని రేవంత్ రెడ్డి తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా రీ-ట్వీట్ చేశారు.

"మణిపూర్ ఎనిమిది నెలలకు పైగా మంటల్లో కాలిపోతోంది, అయినప్పటికీ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్.. శాంతిని నెలకొల్పడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ప్రజలను రక్షించడంలో, ప్రశాంతతను నెలకొల్పడంలో విఫలమైంది.

60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
12,000 మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు.
180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు మహిళలు చెప్పలేని భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రధాని మోదీ మణిపూర్‌లో ఎప్పుడు పర్యటిస్తారు?

న్యాయం ఎప్పుడు గెలుస్తుంది?

"భారత్ జోడో న్యాయ్ యాత్ర" న్యాయం కోరడం లక్ష్యంగా పెట్టుకుంది.

మేము మణిపూర్‌కు మద్దతు ఇస్తున్నాము. మరియు అన్యాయానికి వ్యతిరేకంగా మా ప్రయాణం అక్కడ ప్రారంభమవుతుంది.

మణిపూర్, మేము మీతో ఉన్నాము!" అని ట్వీట్ చేసింది.

More Telugu News