ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న డీసీఎం... ఆరుగురి మృతి
- మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో ప్రమాదం
- సంతకు వచ్చిన వారిని బలిగొన్న డీసీఎం
- జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
మృతులను బాలానగర్ మండలంలోని మేడిగడ్డ తండా, నందారం, బీబీనగర్ తండా వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటన అక్కడున్న వారినందరినీ కంటతడి పెట్టించింది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళుతున్న డీసీఎం... ఆటోను ఢీకొట్టింది. ఆరుగురి మృతికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పు పెట్టారు. ఇది 44వ నెంబర్ జాతీయ రహదారి. డీసీఎంకు నిప్పు పెట్టి.. ఆందోళన వ్యక్తం చేయడంతో ఇరువైపులా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.