146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడూ సాధించని రికార్డును నెలకొల్పిన విరాట్ కోహ్లీ
- ఏడు వేర్వేరు సంవత్సరాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ
- దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సాధించిన 76 పరుగులతో అరుదైన మైలురాయి
- 1877 నుంచి ఏ ఆటగాడూ సాధించని రికార్డు
కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులతో చెలరేగిన డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కగిసో రబడా, మార్కో యెన్సెన్, బర్గర్ల పేస్ త్రయం ముందు భారత బ్యాటర్లు నిలవలేకపోయారు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్లో 245 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అయితే విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు రాబట్టాడు. 76 పరుగులు కొట్టగా అందులో ఏకంగా 12 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి.