ఐదు గ్యారెంటీలకు సంబంధించి రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆశావహుల నుంచి ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. ఆయా గ్రామాలు... వార్డులలో అధికారులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు పత్రాలు ఇవే....