Vande Bharat Rail: ఇప్పుడు మరింత వేగంగా.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు స్పీడ్ పెంపు

Now Kacheguda Yashwantpur Express 15 Minutes Faster Than Previous
షార్ట్స్‌లో చూడండి
కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైలు వేగం 15 నిమిషాల మేర పెరిగింది. దీంతో రెండు స్టేషన్ల మధ్య ప్రయాణ దూరం  8.15 గంటలకు తగ్గింది. ప్రస్తుతం ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. అంటే ప్రయాణ సమయం 8.30 గంటలు. 

ఇప్పుడు రైలు వేగాన్ని 15 నిమిషాల మేర పెంచడంతో ఈ సమయంలోనూ పావుగంట కలిసి వస్తుంది. అంటే ఇకపై ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 

తిరుగు ప్రయాణంలో గతంలో మధ్యాహ్నం 2.45 గంటలకు రైలు బయలుదేరగా ఈ సమయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గతంలో రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకోగా, ఇప్పుడు 11 గంటలకే చేరుకోనుంది. ఇది మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం మీదుగా ప్రయాణిస్తుంది.

Go Back to Shorts
Vande Bharat Rail
Kacheguda
Yesvantpur

More Telugu News