తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో మోదీ..?
- లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ
- దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్
- ఈసారి మెజారిటీ స్థానాల్లో జెండా ఎగరేయాలని యోచన
తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కనీసం 12 సీట్లను గెలుచుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ సీనియర్ నేతలు ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాలపై పార్టీ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీని తెలంగాణలోని సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.