భార్యా, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట కలెక్టర్ గన్మెన్
- సిద్దిపేట జిల్లా రామునిపట్నంలో చోటు చేసుకున్న విషాదం
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ వద్ద గన్మెన్గా పని చేస్తోన్న నవీన్
- ఆన్ లైన్ బెట్టింగ్స్ కారణంగా పెద్ద మొత్తంలో అప్పులు
- భార్యతో గొడవ... ఇద్దరు పిల్లలు సహా భార్యను తుపాకీతో కాల్చిన నవీన్
- ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న నవీన్
ఈ విషాద ఘటనపై సిద్దిపేట సీపీ శ్వేత మీడియాతో మాట్లాడుతూ... నరేశ్ సర్వీస్ రివాల్వర్తో కొడుకు, కూతురు, భార్యను కాల్చి చంపాడని, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఆయనకు అప్పులు ఉన్నట్లుగా తెలిసిందన్నారు. ఆన్ డ్యూటీలో ఉండగానే ఇలా జరిగిందని, అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడించారు.