మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోంది: నారా లోకేశ్
- తుని నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- శృంగవృక్షంలో కాకినాడ సెజ్ రైతులతో సమావేశం
- పరిశ్రమలు వస్తే గ్రామాలు బాగుపడతాయన్న లోకేశ్
- తాము తెచ్చిన పరిశ్రమలను వైసీపీ సర్కారు తరిమేసిందని ఆరోపణ
టీడీపీ ప్రభుత్వ పాలనలో కియాను తీసుకువచ్చామని, ఈ పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాలు మారిపోయాయని లోకేశ్ చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకువచ్చానని, ఆ పరిశ్రమతో 6 వేల మంది ఉపాధి పొందారని వెల్లడించారు.
తాము తీసుకువచ్చిన పలు పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని లోకేశ్ మండిపడ్డారు. పరిశ్రమలు వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అందుకే రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.