చీకట్లో శ్రీలంక.. దేశ వ్యాప్తంగా ఆగిపోయిన విద్యుత్ సరఫరా
- సాంకేతిక సమస్యతో ఆగిన విద్యుత్ సరఫరా
- దారుణంగా ఆసుపత్రుల్లోని రోగుల పరిస్థితి
- ఏడాది కాలంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక
గత ఏడాదిగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. దేశంలో విద్యుత్ కోతలు కూడా కామన్ అయిపోయాయి. ప్రతి రోజూ 10 గంటల సేపు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో... ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.