రైలు డోరు వద్ద నిలబడి ప్రయాణించిన 8వ తరగతి బాలుడి దుర్మరణం
- దైవదర్శనానికి స్నేహితులతో కలిసి వెళుతుండగా దారుణం
- డోర్ వద్ద ఉన్న బాలుడికి విద్యుత్ స్తంభం తగలడంతో కింద పడ్డ వైనం
- తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం
సంజీవయ్య పార్కు-జేమ్స్ స్ట్రీట్ స్టేషన్ల మార్గమధ్యలో రైలు వెళుతుండగా డోర్ వద్ద నిలబడ్డ బంటీకి విద్యుత్ స్తంభం తగిలింది. దీంతో, రైల్లోంచి కిందపడ్డ బంటీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.