సలాడ్లో మనిషి వేలు.. రెస్టారెంట్కు వెళ్లిన మహిళకు భారీ షాక్!
- న్యూయార్క్ నగరంలోని చాప్ట్ రెస్టారెంట్లో ఏప్రిల్లో ఘటన
- తాను మనిషి వేలు నమిలిన విషయం గుర్తించి దిమ్మెరపోయిన కస్టమర్
- రెస్టారెంట్ నుంచి పరిహారం కోరుతూ తాజాగా కోర్టులో కేసు
కేసు వివరాల ప్రకారం, ఘటనకు ముందురోజు రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరు కూరలు తరుగుతుండగా ప్రమాదవశాత్తూ అతడి వేలు తెగింది. వెంటనే అక్కడున్న వారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తెగిపడిన వేలు కూరగాయల్లో ఉండిపోవడంతో చివరకు అది సలాడ్లో కలిసింది. కాగా, స్థానిక ఆరోగ్య విభాగం అధికారులు రెస్టారెంట్పై ఇప్పటికే జరిమానా విధించారు. అయితే, ఘటన కారణంగా తనకు శారీరక, మానసిక సమస్యలు వచ్చాయని బాధితురాలు తన పిటిషన్లో పేర్కొంది. తనకు రెస్టారెంట్ చెయిన్ నిర్వాహకులు నగదు రూపంలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామంపై రెస్టారెంట్ నిర్వాహకులు ఇంకా స్పందించాల్సి ఉంది.