విమానంలో నీటి లీకేజీ.. స్పందించిన ఎయిర్ ఇండియా
- నవంబర్ 24న గాట్విక్ నుంచి అమృత్సర్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో ఘటన
- ఓవర్ హెడ్ బిన్స్ నుంచి కొన్ని చోట్ల ధారగా కారిన నీరు, నెట్టింట వీడియో వైరల్
- ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా
- ప్రభావిత సీట్లలోని ప్రయాణికులను మరో చోటుకు మార్చినట్టు వెల్లడి
ఎయిర్ ఇండియా విమానం.. నవంబర్ 24న గాట్విక్ నుంచి అమృత్సర్కు బయల్దేరింది. ఈ క్రమంలోనే ప్రయాణికులు కూర్చునే క్యాబిన్ పైకప్పు నుంచి ఓ చోట లీకేజీ మొదలైంది. అయితే, లీకేజీ కింద సీట్లలో కూర్చున్న ప్రయాణికులను తక్షణమే మరో చోటుకు మార్చామని సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. లీకేజీకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.