ముఖ్యమంత్రికి లోకల్... నాన్ లోకల్ ఉంటుందా?: కామారెడ్డిలో మంత్రి కేటీఆర్
- కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ అన్న కేటీఆర్
- కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానన్న మంత్రి
- తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్న కేటీఆర్
బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బీడీ కార్మికుల పెన్షన్కు కటాఫ్ తేదీని తొలగిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతామన్నారు. జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. అసైన్డ్ భూములపై యజమానులకు పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు.