పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
- తాండూర్ తో పాటు మణికొండలోని పైలట్ నివాసానికి అధికారులు
- ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన వైనం
- లెక్కల్లోకి రాని రూ.44 లక్షలు గుర్తించిన అధికారులు
ఈ సోదాల్లో పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ. 20 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా పైలట్ సోదరుడి ఇంటిలో రూ.20 లక్షలు గుర్తించినట్లు చెప్పారు. ఈ నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.