Road Accident: వేగంగా వెళ్లి ఆగివున్న వాహనాలను ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి

  • టోల్ ప్లాజా వద్ద ఆగివున్న కార్లను ఢీకొన్న ఇన్నోవా
  • ప్రమాదానికి గురైన మొత్తం ఆరు వాహనాలు
  • ఇద్దరి పరిస్థితి విషమం
speeding car hits multiple vehicles in Mumbai and 3 dead

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రావైపు వెళ్తున్న ఇన్నోవా కారు ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు వెల్లడించారు.

 సీ లింక్‌లో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిందని, ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం 6 కార్లు ప్రమాదానికి గురయ్యాయని వివరించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

More Telugu News