ఓటు కిస్మత్ను మారుస్తుంది.. తేడా వస్తే జీవితాలు కిందామీద అవుతాయి: కేసీఆర్
- కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశమిస్తే ఏమీ చేయలేదని విమర్శ
- రైతు బంధు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు దుబారా అంటున్నారని ఆగ్రహం
- రైతుబంధును క్రమంగా రూ.16వేలకు పెంచుతామన్న కేసీఆర్
గతంలో ఎమ్మెల్యేలు అయ్యారు కానీ వారు ధర్మపురి అభివృద్ధి చేయలేదన్నారు. ఈశ్వర్ పీరియడ్లో అభివృద్ధి జరిగిందని, వాగులపై చెక్ డ్యాంలు కట్టించారన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నామన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో చిమ్మచీకట్లు, మంచి, సాగునీళ్లు లేవన్నారు. వలస బతుకులు, ఎక్కడ చూసినా అంధకారమే అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక కరెంట్, తాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. సాగునీటి సమస్యను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ లేదన్నారు. ప్రధాని మోదీకి ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని చెబితే తాను అంగీకరించలేదన్నారు.