ఐదేళ్లలో మనకూ దేశీ ఐరన్ డ్రోమ్
- శత్రుదేశాల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థ
- స్టెల్త్ ఫైటర్స్, క్షిపణులను గాల్లోనే పేల్చేయగలదు
- అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో
- 2028-29 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం
దేశీ దీర్ఘకాల సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ను రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ‘కుశ’ పేరుతో అభివృద్ధి చేస్తోంది. దీన్ని రష్యాకు చెందిన ఎస్-400 ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పోల్చవచ్చు. ఎస్ 400 సిస్టమ్ ఇటీవలే భారత వాయు సేనకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇలాంటిదాన్నే ఇప్పుడు డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. దీనికి కేంద్ర కేబినెట్ 2022 మే నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.