వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన నారా భువనేశ్వరి
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- చంద్రబాబు అరెస్ట్ అనంతరం మృతి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు
- నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర
- తిరుపతిలో మహిళలతో ముఖాముఖి
ఆఖరికి చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాస్తే, పనీపాటా లేనట్టు ఆ లేఖపైనా విచారణ జరుపుతున్నారని భువనేశ్వరి విమర్శించారు. లేఖపై విచారణ కోసం వినియోగించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగిస్తే బాగుంటుందని హితవు పలికారు.
టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి భయపడకుండా ఐక్యంగా పోరాడుదాం అని పార్టీ శ్రేణులుకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. మనం ఇప్పుడు చేసే పోరాటం భవిష్యత్తు కోసమేనని ఉద్ఘాటించారు.