ఒకవేళ టీమిండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే.. : బోల్డ్ ఆఫర్ ప్రకటించిన పాకిస్థాన్ నటి

  • అహ్మదాబాద్ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన ఇండియా
  • ఇండియాపై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలన్న సెహర్ షిన్వారీ
  • ఢాకాకు వెళ్లి ఒక క్రికెటర్ తో డేట్ కు వెళ్తానని వ్యాఖ్య
ప్రపంచ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ఓటమిని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు రేపు ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఒక బోల్డ్ ఆఫర్ ను ప్రకటించింది. ఇండియాపై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ఆకాంక్షించింది. ఇండియాను ఓడిస్తే తాను ఢాకాకు వెళ్లి ఒక క్రికెటర్ తో డేట్ కు వెళ్తానని చెప్పింది. మరోవైపు ఈ టోర్నీలో ఇండియాతో పాకిస్థాన్ మరోసారి తలపడాలంటే... ఆ జట్టు కనీసం సెమీస్ కు చేరాల్సి ఉంటుంది.

Sehar Shinwari
Pakistan
Bangladesh
Date
World Cup

More Telugu News