కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
- కాంగ్రెస్లో అవమానాలకు గురయ్యానన్న పొన్నాల
- జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారని ప్రశంస
- జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి
ముఖ్యమంత్రి అయిన మూడేళ్లకే కేసీఆర్ కులగణన, సమగ్ర సర్వే చేయించారన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. జనగామలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జనగామ అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు.