Ana Lilia Rivera: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన మెక్సికో మహిళా రాజకీయవేత్త

  • ఢిల్లీలో పీ20 సదస్సు
  • పలు దేశాల పార్లమెంటు స్పీకర్లతో సమావేశం
  • హాజరైన మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా
  • మోదీలో సోదరుడ్ని చూసుకున్న విదేశీ నేత
Mexican senate president Ana Lilia Rivera ties Rakhi to PM Modi at P20 Summt

జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (పీ20) న్యూ ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఇవాళ, రేపు ఢిల్లీలో జరిగే ఈ పీ20 సదస్సుకు ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. నేడు ఏర్పాటు చేసిన పలు సెషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పీ20 సదస్సు వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా రాఖీ కట్టారు. మోదీని ఓ సోదరుడిగా భావిస్తున్నట్టు తెలిపారు. ఓ విదేశీ రాజకీయవేత్త తనకు రాఖీ కట్టడం పట్ల మోదీ హర్షం వెలిబుచ్చారు. అనా లిలియా తలపై చేయి వేసి దీవించారు. భారత్-మెక్సికో సంబంధాలు మరింత సుహృద్భావ ధోరణిలో ముందుకెళ్లాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News