Indian Railways: రైలు ప్రయాణికులకు గమనిక.. ఈ రూట్లలో 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

  • విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు
  • ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు
  • మరికొన్ని రైళ్లు దారిమళ్లింపు
Vijayawada Railway Cancelled some trains in various routs

విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా  రద్దు చేసింది.

విజయవాడ-తెనాలి (07279) రైలును రేపటి నుంచి 15వ తేదీ వరకు రద్దు చేయగా, తెనాలి-విజయవాడ (07575) రైలును కూడా అదే తేదీల్లో రద్దు చేశారు. బిట్రగుంట-విజయవాడ (07977/07978) రైలు 11వ తేదీ నుంచి 15 వరకు, బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237/17238)  రైలును రేపటి నుంచి 13 వరకు, విజయవాడ- ఒంగోలు (07461) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు రద్దు చేశారు. ఒంగోలు- విజయవాడ (07576) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ- గూడూరు (17259/17260) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు,  విజయవాడ- గూడూరు(07500) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, గూడూరు- విజయవాడ (07458) రైలును 12వ తేదీ నుంచి 16 వరకు, రాజమండ్రి- విశాఖపట్టణం (07466/07467) రైలును రేపటి నుంచి 15 వరకు, గుంటూరు- విశాఖపట్టణం (17239/17240) రైలును రేపటి నుంచి 16వరకు,  విజయవాడ- విశాఖపట్టణం (22701/22702) రైలును 9,10,11,13,14 తేదీల్లో రద్దు చేశారు. రాజమండ్రి- విజయవాడ (07767) రైలును 9వ తేదీ నుంచి 15 వరకు,  విజయవాడ- రాజమండ్రి (07459) రైలును రేపటి నుంచి 15వరకు, మచిలీపట్టణం- విశాఖపట్నం (17219/17220) రైలును రేపటి నుంచి 16వరకు, విజయవాడ- గూడూరు (12743/12744) రైలును 11వ తేదీ నుంచి 16వరకు పూర్తిగా రద్దు చేశారు.
 
పాక్షికంగా రద్దు అయిన రైళ్లలో.. నర్సాపూర్-గుంటూరు (17281/17282) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దు చేయగా, మచిలీపట్టణం-విజయవాడ(07896) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ- మచిలీపట్నం (07769), నర్సాపూర్- విజయవాడ(07883), విజయవాడ- మచిలీపట్టణం (07866), మచిలీపట్టణం-విజయవాడ(07770), విజయవాడ- భీమవరం జంక్షన్(07283), మచిలీపట్టణం-విజయవాడ (07870), విజయవాడ- నర్సాపూర్ (07861) రైళ్లు అవే తేదీల్లో అవే రూట్ల మధ్య రద్దు చేశారు.

విజయవాడ, గుడివాడ-భీమవరం జంక్షన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లలో ధన్‌బాద్- అలెప్పి(13351) రైలును రేపటి నుంచి 13వరకు, హతీయ- బెంగుళూరు(12835) రైలును ఎల్లుండి, టాటా- బెంగుళూరు (12889) రైలును 13వతేదీ, టాటా- యశ్వంత్‌పూర్ (18111) 12వ తేదీన, హతియ- ఎర్నాకుళం (22837) రైలును 9వ తేదీన దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

More Telugu News