Chandrababu: రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసిన హైకోర్టు

  • రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు
  • ఈ నెల 29వ తేదీకి విచారణను వాయిదా వేసిన హైకోర్టు
  • ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నారా లోకేశ్
AP High Court adjourned hearing of Chandrababu bail plea on inner ring road case to Sep 29

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈరోజు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో తీవ్ర నిరాశ ఎదురయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులు కూడా నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నారా లోకేశ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News