49 ఏళ్లుగా చంద్రబాబు నాకు తెలుసు.. చిన్న తప్పు చేయడానికి కూడా భయపడతారు: చింతా మోహన్
- జనాలు ఏమనుకుంటారోనని తమ్ముడికి కూడా సాయం చేయని వ్యక్తి చంద్రబాబు అని చింతా మోహన్ కితాబు
- చంద్రబాబు అరెస్ట్ టీడీపీకే అనుకూలంగా మారిందని వ్యాఖ్య
- రూ. 17 వేల కోట్లు ఏమైపోయాయో టీటీడీ చెప్పాలని డిమాండ్
ఏపీ స్పీకర్ తమ్మినేనిపై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని చింతా మోహన్ అన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ చేస్తున్నది ఎన్నికల స్టంట్ మాత్రమేనని చెప్పారు. టీటీడీకి చెందిన రూ. 17 వేల కోట్ల నిధులు, బంగారం నిల్వలు ఏమైపోయాయో టీటీడీ అధికారులు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 17 వేల కోట్లను వడ్డీ కోసం ఇచ్చామని టీటీడీ అధికారులు చెపుతున్నారని... ఎక్కడ ఇచ్చారని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు.