ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మహిళా అసిస్టెంట్ కలెక్టర్ మృతి

Missing Rourkela Assistant Collector Found Dead
  • రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సస్మిత మింజ్
  • 15న విధులకు వెళ్లి తిరిగి రాని సస్మిత
  • 17న నగరంలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు
  • వెళ్తే కలిసేందుకు నిరాకరణ
  • రెండు రోజుల తర్వాత ఓ జలాశయంలో మృతదేహం గుర్తింపు
ఒడిశాలోని రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సస్మిత మింజ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 15న విధులకు వెళ్లిన సస్మిత తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత 17న నగరంలోని ఓ హోటల్‌లో ఆమె ఉన్నట్టు తెలిసి తల్లి, సోదరుడు వెళ్లి కలిసేందుకు ప్రయత్నించారు. 

తనకు విశ్రాంతి కావాలని చెప్పి ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో కనిపించింది. తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Sasmita Minz
Rourkela
Odisha

More Telugu News