శరద్ పవార్ నివాసంలో I.N.D.I.A. కూటమి సమన్వయ కమిటీ భేటీ
- ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయం
- అక్టోబర్ మొదటివారంలో భోపాల్లో మొదటి సభ నిర్వహించనున్న కూటమి
- పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతిపై గళమెత్తాలని నిర్ణయం
ఈ సమావేశానికి హాజరైన వారిలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), రాఘవ్ చద్దా (ఆమ్ ఆద్మీ పార్టీ), జావెద్ అలీఖాన్ (ఎస్పీ), సంజయ్ ఝా (జేడీ-యూ), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గైర్హాజరయ్యారు.