అపనమ్మకానికి ముగింపు పలుకుదాం.. కలసి నడుద్దాం: ప్రధాని పిలుపు
- సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అని ప్రధాని నినాదం
- పెరిగిపోయిన అపనమ్మకాన్ని తొలగించుకుందామని పిలుపు
- ప్రపంచ మంచి కోసం కలసి పనిచేద్దామని ప్రకటన
‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ అనే భారత నినాదాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. జీ20కి భారత్ నాయకత్వం చేరికకు చిహ్నంగా మారినట్టు పేర్కొన్నారు. ఇంటా, బయటా అందరితో కలసి అన్న దానికి సబ్ కా సాత్ ను ప్రస్తావించారు. ‘‘ఇది ప్రజల జీ20 సదస్సు. 60కు పైగా పట్టణాల్లో 200కు పైగా కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచానికి మంచి చేసేందుకు మనమంతా కలసి పనిచేద్దాం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.