మూడ్రోజులు బిజీ బిజీగా మోదీ.. 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాల ఏర్పాటు
- రేపు, ఎల్లుండి న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సదస్సు
- హాజరు కానున్న పలు దేశాల అధినేతలు
- నేటి నుంచి పలు దేశాల నేతలతో చర్చలు జరపనున్న మోదీ
కెనడా, కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, ఈయూ/ఈసీ, బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన కుమార్తె సైమా వాజెద్తో కలిసి వచ్చే అవకాశం ఉంది. త్రిపురతో రైలు మార్గాన్ని, రాంపాల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ను ప్రధాని మోదీతో కలిసి హసీనా ప్రారంభించనున్నారు. రెండు దేశాల పౌరులు ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు డాలర్లలో కాకుండా స్థానిక కరెన్సీలో చెల్లించేందుకు రూపే-టాకా కార్డును సులభతరం చేసే ఒప్పందంతో సహా పలు ఒప్పందాలపై ఆమె సంతకం చేయనున్నారు.