Team India: ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా దూకుడు... భారీ స్కోరు దిశగా భారత్

  • ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాక్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 40 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు
  • ఓ దశలో 66 పరుగులకే 4 వికెట్లు డౌన్
  • అర్ధసెంచరీలతో ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా
Team India eyes on huge total against Pakistan in Asia Cup

ఆసియా కప్ లో పాకిస్థాన్ తో పోరులో టీమిండియా బ్యాటర్లు నిదానంగా పుంజుకున్నారు. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఓ దశలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ ను ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ, ఆ తర్వాత గేర్లు మార్చి భారీ షాట్లతో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కిషన్, పాండ్యా ఐదో వికెట్ కు 138 పరుగులు జోడించడం విశేషం. ఈ జోడీని హరీస్ రవూఫ్ విడదీశాడు. ఇషాన్ కిషన్ 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

ప్రస్తుతం భారత్ స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు. హార్దిక్ పాండ్యా 80 పరుగులతోనూ, జడేజా 1 పరుగుతోనూ క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రవూఫ్ 3, అఫ్రిది 2 వికెట్లు తీశారు.

More Telugu News