టీటీడీ పాలకమండలి కొత్త సభ్యులు వీరే.. తెలంగాణ నుంచి ఎంపీ భార్యకు చోటు

TTD new palaka mandli members announced
  • సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్, తిప్పేస్వామిలకు చోటు
  • శిద్ధా రాఘవరావు తనయుడు శిద్ధా సుధీర్‌కూ చోటు
  • కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి పలువురికి చోటు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 24 మంది సభ్యులతో కూడిన పాలకమండలి సభ్యుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కి చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డం సీతారంజిత్ రెడ్డికి చోటు దక్కింది.

సిధావ‌త్ యానాద‌య్య‌, చందే అశ్వ‌ద్ధ నాయ‌క్, మేకా శేషుబాబు, ఆర్ వెంక‌ట సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి గారి సీతారామారెడ్డి, గాదిరాజు వెంక‌ట సుబ్బ‌రాజు, పినాక శ‌ర‌త్ చంద్రారెడ్డి, సామల రామిరెడ్డి, బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ ప‌ళ‌నిసామి, ఎస్ఆర్ విశ్వ‌నాథ్ రెడ్డి, గ‌డ్డం సీతారెడ్డి, కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్, శిద్దా వీరవెంక‌ట సుధీర్ కుమార్ (శిద్ధా రాఘవరావు తనయుడు), సుద‌ర్శ‌న్ వేణు, నెరేసు నాగ‌స‌త్యం, ఆర్వీ దేశ్‌పాండే, అమోల్ కాలే, డాక్ట‌ర్ ఎస్ శంక‌ర్, మిలింద్ కేశ‌వ్ న‌ర్వేక‌ర్, డాక్ట‌ర్ కేత‌న్ దేశాయి, బోరా సౌర‌భ్‌కు చోటు ల‌భించింది.
Go Back to Shorts
TTD
Tirumala
Tirupati

More Telugu News