భార్యతో గొడవ.. కౌన్సెలింగ్కు రమ్మంటూ పోలీసుల పిలుపు.. భయంతో టెకీ ఆత్మహత్య
- సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఘటన
- టెకీకి రెండు నెలల క్రితమే వివాహం, పెళ్లయిన నాటి నుంచే భార్యతో విభేదాలు
- 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన టెకీ
- భర్తపై భార్య గోదావరిఖని ఠాణాలో ఫిర్యాదు
- కౌన్సెలింగ్కు హాజరుకావాలంటూ టెకీకి పోలీసుల నుంచి పిలుపు
- భయపడిపోయిన టెకీ రంగనాయక రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య
ఈ క్రమంలో కిరణ్ 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంతో నార్సింగి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. మరోవైపు, గోదావరి ఖని ఠాణాలో అశ్విని తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు కిరణ్ను బుధవారం కౌన్సెలింగ్కు రమ్మని పిలిచారు.
కాగా, మంగళవారం సాయంత్రం తన మేనమామ కొడుకు నరేందర్తో కలిసి కిరణ్ రంగనాయక సాగర్ జలాశయానికి వెళ్లాడు. నరేందర్ ఫోను తీసుకొని మరో వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించిన కిరణ్ నరేందర్ను కాస్తంత దూరంలో నిలబడాలని కోరాడు. ఈ క్రమంలో నరేందర్ దూరంగా వెళ్లిన కాసేపటికి వెనక్కు తిరిగి చూస్తే కిరణ్ కనిపించలేదు. దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. గురువారం ఉదయం జలాశయంలో కిరణ్ మృతదేహం తేలియాడుతూ పర్యాటకులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.