చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఇస్రో.. కోట్లాదిమంది ప్రార్థనలు
- చంద్రయాన్-3 సక్సెస్ కోసం పూజలు
- భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ
- సాయంత్రం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్న ఇస్రో
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్షేమంగా దిగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019లో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రాజెక్టు వైఫల్యం తర్వాత కారణాలను విశ్లేషించి, అప్పుడు జరిగిన పొరపాట్లకు మళ్లీ తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. ఈసారి కచ్చితంగా జాబిల్లిని ముద్దాడి చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 5:20 గంటలకు ఇస్రో వెబ్ సైట్ తో పాటు ఇస్రో యూట్యూబ్ చానెల్, డీడీ నేషనల్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత క్షణాన్ని చూసేందుకు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.