Prakash Raj: చంద్రయాన్-3ని అపహాస్యం చేస్తూ పోస్ట్ పెట్టిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు

  • బాగల్‌కోట్‌లోని బనహట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన హిందూసంస్థల ప్రతినిధులు
  • భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రయోగాన్ని అపహాస్యం చేశారని ఆరోపణ
  • ఫిర్యాదు అందినట్లు వెల్లడించిన పోలీసులు
Police complaint against Prakash Raj for objectionable Chandrayaan tweet

సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకలోని బాగల్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. చంద్రయాన్-3పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్ ఇప్పుడే పంపిన ఫోటో అంటూ టీ వడపోస్తున్న ఒక వ్యక్తి కార్టూన్‌ను ఆయన పోస్ట్ చేశాడు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ హిందూ సంస్థ నాయకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

చంద్రయాన్-3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు సంబంధించి ఫిర్యాదు అందిందని, ఈ మిషన్‌పై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారని బాగల్‌కోట్‌లోని బనహట్టి పోలీసులు తెలిపారు.

More Telugu News