Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు... ఇద్దరి మృతి

RTC Bus rams into a gorge in Alluri district
  • అల్లూరి జిల్లాలో విషాద ఘటన
  • చోడవరం నుంచి పాడేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు
  • పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద ప్రమాదం
  • మలుపు తిరిగే క్రమంలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాడేరు ఘాట్ రోడ్డులో ఈ ప్రమాద ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పాడేరు ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద మలుపు తిరుగుతుండగా, బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

More Telugu News

Road Accident
RTC Bus
Paderu Ghat Road