Sharmila: ఢిల్లీలో షర్మిల.. నేడు రాహుల్‌తో భేటీ?

  • కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీని విలీనం చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం
  • బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లిన షర్మిల
  • పార్టీ విలీనంపై ఖర్గే, రాహుల్‌ గాంధీతో చర్చించే అవకాశం
sharmila willl meet rahul gandhi in delhi

వైఎస్సార్‌‌ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం  జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి షర్మిల వెళ్లారు. బెంగళూరు నుంచి హస్తిన చేరుకున్న ఆమె.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీ విలీనంపై వీరితో షర్మిల చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి షరతులు లేకుండానే తన పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు చర్చ సాగుతోంది. పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగుతారని నేతలు చెబుతున్నారు.

More Telugu News