2028లోనూ మా ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం పెడతాయి: ప్రధాని మోదీ
- కాంగ్రెస్కు విజన్, నిజాయతీ, ఆర్థిక విధానం లేవన్న ప్రధాని
- భారత ప్రజలు, సైన్యం, వ్యాక్సిన్పై నమ్మకం లేదని ఆగ్రహం
- బెంగాల్, తమిళనాడు, ఒడిశా సహా వివిధ రాష్ట్రాలు కాంగ్రెస్కు నో కాన్ఫిడెన్స్ చెప్పాయని ఎద్దేవా
- విపక్షాలు NDAకు రెండు Iలు చేర్చి I.N.D.I.A.గా మార్చాయని వ్యాఖ్య
- ఇండియా కూటమిలో అందరికీ ప్రధాని కావాలనే కోరికంటూ సెటైర్
విపక్షాలు ఇండియాను.. I.N.D.I.A. అంటూ ముక్కలు చేశాయన్నారు. విపక్షాలు NDAకు రెండు Iలు చేర్చి I.N.D.I.A.గా మార్చాయని, మొదటి I.. 26 పార్టీల అహంకారానికి, రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతి పథకం వెనుక కాంగ్రెస్ ఓ కుటుంబం పేరే చేర్చిందన్నారు. విపక్షాలలో ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి కావాలని ఉందన్నారు. కానీ అక్కడ స్కీంలకు బదులు స్కామ్లు ఉంటాయన్నారు. తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి గాంధీ పేరును వినియోగించుకుందని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అవినీతి కూటమి అన్నారు. కాంగ్రెస్కు కుటుంబ పాలన అంటే ఇష్టమన్నారు.