జగన్ ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్ భూమన
- రేపు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించనున్న భూమన
- కొడుకుతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన భూమన
- టీటీడీ ఛైర్మన్ గా రెండో సారి బాధ్యతలను చేపడుతున్న వైనం
రేపు ఉదయం టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలను చేపట్టడం ఇది రెండోసారి. 2006-2008 మధ్య ఆయన తొలిసారి ఛైర్మన్ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త ఛైర్మన్ గా భూమనను జగన్ నియమించారు.