HMDA: మూడు జిల్లాల్లోని భూముల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్

  • రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో వేలం
  • చదరపు గజం కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలు
  • ఈ వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 16
HMDA Release Another Notification For Govt Land Auction In Telangana

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మరోమారు భూముల వేలానికి సిద్ధమైంది. మూడు జిల్లాల్లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాల్లోని భూములను వేలం వేయనున్నట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్, పీరంచెరువులోని భూములను అమ్మకానికి పెట్టింది. సంగారెడ్డిలో వెలిమల, అమీన్ పూర్, నందిగామ, పతిఘనపూర్, కిష్టారెడ్డిపేటలతో పాటు మేడ్చల్ - మల్కాజ్ గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం ప్రాంతాల్లోని భూములను విక్రయించనుంది.

నోటిఫికేషన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూములకు చదరపు గజానికి కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఆన్ లైన్ లో జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 16 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 18 నుంచి ఈ-వేలం ద్వారా భూముల విక్రయం జరగనుందని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్ఎండీఏ వెబ్ సైట్ సందర్శించాల్సిందిగా అధికారులు సూచించారు.

More Telugu News