సీఎం పదవి నన్ను వదిలి పెట్టడం లేదు: రాజస్థాన్ ముఖ్యమంత్రి
- తాను సీఎం పదవిని వదులుకోవాలని భావిస్తున్నానని చెప్పిన గెహ్లాట్
- సీఎం పదవి వదిలేస్తానని చెప్పేందుకు ధైర్యం కావాలని వ్యాఖ్య
- వచ్చే ఎన్నికల్లో గెలిస్తే విజన్ 2030ని అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
తనను మూడోసారి సీఎంగా ఎంపిక చేశారని, ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే విజన్ 2030ని అమలు చేస్తామన్నారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే రాజస్థాన్ బలమైన రాష్ట్రంగా ఎదిగిందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుండి ఈ పదవి కోసం సచిన్ పైలట్తో వివాదం నెలకొంది. పార్టీ అగ్రనాయకత్వం సచిన్ పైలట్కు నచ్చజెప్పి గెహ్లాట్ను పీఠంపై కూర్చోబెట్టింది. అయితే తనను సీఎం పదవి విడిచిపెట్టడం లేదని గెహ్లాట్ చెప్పడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి.