పోలీసుల సమక్షంలో ప్రతిపక్షంపై దాడులు చేసి బంద్ చేయడం వైసీపీకే చెల్లింది: నారా లోకేశ్
- నిన్న అంగళ్లు, పుంగనూరుల్లో హింసాత్మక ఘటనలు
- నేడు బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ
- చిత్తూరులో అమరరాజా కంపెనీ బస్సు ధ్వంసం
- ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్
సైకో జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని పేర్కొన్నారు. పోలీసులు చూస్తుండగా ప్రతిపక్షంపై దాడులు చేసి బంద్ చేయడం వైసీపీకే చెల్లిందని లోకేశ్ విమర్శించారు. చిత్తూరులో అమరరాజా కంపెనీ బస్సును ధ్వంసం చేసి, ఆ సంస్థ ఉద్యోగులపై దాడి చేశారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎక్కడ అని ప్రశ్నించారు.